పశ్చిమ బెంగాల్ రాష్ట్రాన్ని కుదిపేసిన ఆర్జీ కర్ వైద్య కళాశాల మహిళా వైద్యురాలి దారుణ హత్య కేసు.. కేవలం ఒక సామాన్య నేరం కాదు, అది ఒక వ్యవస్థీకృత ప్రభుత్వ నేరం! ఒక పౌర స్వచ్ఛంద సేవకుడిని బలిపశువును చేసి, అసలు దోషులను తప్పించేందుకు సాక్షాత్తూ రాష్ట్ర ప్రభుత్వమే ఒక ‘రక్షణ కవచం’లా ఎందుకు మారింది? ఈ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ లోతుగా దర్యాప్తు చేస్తే.. అధికార తృణమూల్ కాంగ్రెస్ అప్రకటిత ముఖ్యమంత్రి, ఆ పార్టీ యువరాజు అభిషేక్ బెనర్జీ పేరు తెరపైకి వస్తోంది.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుని కుమారుడు అబేష్ బెనర్జీ ఈ కేసులో ప్రధాన అనుమానితుడిగా మారుతుండటంతో, తన తమ్ముడిని, ముఖ్యంగా తన కుటుంబ పరువును కాపాడుకునేందుకు అభిషేక్ బెనర్జీ అత్యంత ప్రణాళికాబద్ధంగా ఈ దారుణాన్ని కప్పిపుచ్చే వ్యూహం పన్నారా? అన్న కోణంలో సంచలన వాస్తవాలు వెలుగుచూస్తున్నాయి.
వ్యవస్థలను శాసించిన ఆ ‘అదృశ్య హస్తం’ ఎవరిది?
ఘటన జరిగిన వెంటనే స్థానిక రక్షక భటులు (పోలీసులు) దీన్ని ‘ఆత్మహత్య’గా ఎందుకు చిత్రీకరించారు? బాధితురాలి తల్లిదండ్రులను గంటల తరబడి ఎందుకు వేచి ఉంచారు? మృతదేహాన్ని హడావుడిగా, బలవంతంగా ఎందుకు దహనం చేశారు? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం వినిపిస్తోంది.. పైనుంచి వచ్చిన ‘అత్యున్నత ఆదేశాలు’!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారైనా, రక్షక భట పైఅధికారైనా భయపడేది, పాటించేది ఒకే ఒకరి ఆదేశాలను. ఆయనే అభిషేక్ బెనర్జీ. క్రైమ్ జరిగిన రాత్రి ఆసుపత్రి ప్రాంగణంలో అబేష్ బెనర్జీకి సంబంధించిన ‘చరవాణి సంకేతాల స్థానం’ (టవర్ లొకేషన్) ఉన్నట్లు ఆరోపణలు వచ్చిన వెంటనే, రక్షక భట యంత్రాంగం మొత్తం అప్రమత్తమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ కుటుంబం పేరు బయటకు రాకూడదనే ఏకైక లక్ష్యంతో, అభిషేక్ బెనర్జీ కనుసన్నల్లోనే ఆధారాల చెరిపివేతకు వ్యూహం రచించారని జాతీయవాద విశ్లేషకులు బలంగా వాదిస్తున్నారు.
కళాశాల ప్రధాన అధికారి వెనుక ఉన్నది ఎవరు?
ఆర్జీ కర్ వైద్య కళాశాల ప్రధాన అధికారి సందీప్ ఘోష్ ఒక మాఫియా నాయకుడిలా వ్యవహరించడం వెనుక ఉన్న ధైర్యం ఎవరిది? నేరం జరిగిన ప్రదేశం (క్రైమ్ సీన్) చుట్టూ ఉన్న గోడలను మరమ్మతుల సాకుతో ఏకంగా ప్రభుత్వ యంత్రాలతో కూల్చివేసి ఆధారాలను ధ్వంసం చేసేంత అధికార బలం అతనికి ఎక్కడి నుంచి వచ్చింది?
ఆసుపత్రిలో అబేష్ బెనర్జీ ఆనవాళ్లను పూర్తిగా తుడిచిపెట్టేందుకే అభిషేక్ బెనర్జీ వర్గం నేరుగా సందీప్ ఘోష్ ద్వారా ఈ పనులు చేయించిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సందీప్ ఘోష్ కేవలం ఒక పావు మాత్రమే, అసలు ఆటగాడు ‘కాలిఘాట్’ (ముఖ్యమంత్రి నివాస ప్రాంతం) కేంద్రంగా పావులు కదిపిన అభిషేక్ బెనర్జీ అని రాజకీయ వర్గాల్లో బహిరంగ చర్చ జరుగుతోంది.
దర్యాప్తు సంస్థల మౌనం.. ఒక పచ్చి నిజం!
ఈ కేసు కేంద్ర దర్యాప్తు సంస్థ చేతికి వెళ్లిన తర్వాత కూడా, విచారణ నత్తనడకన సాగడం వెనుక ఉన్న మర్మం ఏమిటి? కిందిస్థాయి నాయకులను, పారిశుద్ధ్య కార్మికులను విచారిస్తున్న కేంద్ర సంస్థలు… నేరుగా ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల పేర్లు, వారి చరవాణి సంభాషణల చిట్టాలు (కాల్ డేటా) బయటకు వస్తున్నా కనీసం వారి వైపు కన్నెత్తి ఎందుకు చూడటం లేదు?
ఒక సామాన్యుడిపై ఆరోపణలు వస్తే అర్ధరాత్రి ఇళ్లలోకి చొరబడి అరెస్టులు చేసే దర్యాప్తు సంస్థలు, అభిషేక్ బెనర్జీ లాంటి ‘అతి ముఖ్య వ్యక్తుల’ (వీఐపీల) ముందు ఎందుకు తలవంచుతున్నాయి? చట్టం ముందు అందరూ సమానులే అనే ప్రజాస్వామ్య మూల సూత్రం, పశ్చిమ బెంగాల్ రాజ కుటుంబం ముందు ఎందుకు మోకరిల్లుతోంది?
శిక్ష పడేదెవరికి? రక్షించబడేదెవరు?
ఒక మహిళా వైద్యురాలికి తన ప్రాణాలకంటే ఘోరమైన అవమానం జరిగితే, దాన్ని రాజకీయ పలుకుబడితో, అధికార గర్వంతో కప్పిపుచ్చడానికి సాగిన ఈ మహా కుట్ర వెనుక అభిషేక్ బెనర్జీ పాత్రపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరగాల్సిందే.
సాక్ష్యాలను నాశనం చేసిన వారు, దానికి సహకరించిన వారు, వెనకుండి నడిపించిన వారు.. ఎవరైనా సరే చట్టం ముందు దోషులే. కేంద్ర దర్యాప్తు సంస్థ ధైర్యంగా అడుగు ముందుకేసి అభిషేక్ బెనర్జీ, అబేష్ బెనర్జీలను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారిస్తేనే అసలు రాక్షసులు వెలుగులోకి వస్తారు. లేదంటే, అరాచక పాలనకు బెంగాల్ శాశ్వత చిరునామాగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. న్యాయం గెలవాలి, ఆ అభాగ్యురాలి ఆత్మకు శాంతి చేకూరాలి..

I am Sirisha N, an independent journalist and proud right-winger. With a Post Graduation from the AP College of Journalism, I bring professional rigor to grassroots reporting. My focus is on cutting through the noise to deliver the unapologetic truth and hold the establishment accountable.
