తెలంగాణ కార్పొరేషన్ల భవితవ్యం తేల్చే కీలక ఘట్టం ఆసన్నమైంది. రేపే పోలింగ్.. ప్రచార హోరు ముగిసి, ఇప్పుడు నిశ్శబ్ధ విప్లవానికి సమయం వచ్చింది. గత కొన్ని రోజులుగా సాగిన ప్రచార సరళిని, క్షేత్ర స్థాయిలో ప్రజల నాడిని గమనిస్తే, ఈ ఎన్నికలు కేవలం కార్పొరేటర్ల ఎంపిక మాత్రమే కాదని, రాష్ట్ర రాజకీయ గతిని మార్చే ఒక చారిత్రక అవసరమని స్పష్టమవుతోంది. ముఖ్యంగా కరీంనగర్, నిజామాబాద్, రామగుండం వంటి కీలక కార్పొరేషన్లలో ఓటర్లు ఈసారి అభివృద్ధి మరియు ధార్మిక ఆలోచనా విధానానికే పెద్దపీట వేయబోతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
ఉత్తర తెలంగాణలో భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ ఒక ప్రభంజనంలా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుని, ఈసారి కేంద్రం బాటలో నడిచే నాయకత్వాన్ని బలపరచాలని అర్బన్ ఓటర్లు నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో కనిపిస్తున్న ఈ మార్పు, రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందనడంలో సందేహం లేదు. పదేళ్ల పాటు పాలించిన బీఆర్ఎస్ పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకం సడలిపోవడంతో, ఆ పార్టీకి వేసే ప్రతి ఓటు వృధా అవుతుందనే భావన ఓటర్లలో బలంగా నాటుకుపోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ అహంకారానికి, బీఆర్ఎస్ వైఫల్యానికి చెక్ పెట్టగల ఏకైక శక్తిగా బీజేపీ మాత్రమే కనిపిస్తోంది.
రేపు జరిగే పోలింగ్లో ప్రతి ఓటు కీలకం కానుంది. పట్టణ ప్రజలు, విద్యావంతులు, యువత ఈసారి పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివచ్చి, తమ అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు వేయడానికి సిద్ధమయ్యారు. “డబుల్ ఇంజిన్ సర్కార్” ఆవశ్యకతను గుర్తించిన తెలంగాణ సమాజం, రేపటి ఫలితాల ద్వారా ఒక స్పష్టమైన, శక్తివంతమైన సందేశాన్ని ఇవ్వబోతోంది. ప్రలోభాలకు లొంగకుండా, భవిష్యత్తు తరాల కోసం, ధర్మం కోసం నిలబడే పార్టీకే రేపు పట్టం కట్టబోతున్నారు.
తాజా సర్వే సంచలనం.. కార్పొరేషన్లలో ఎవరిది హవా? క్షేత్రస్థాయి పరిశీలన మరియు తాజా సర్వే గణాంకాల ప్రకారం వివిధ కార్పొరేషన్లలో పార్టీల బలాబలాలు ఈ విధంగా ఉన్నాయి:
1. కరీంనగర్ కార్పొరేషన్ (మొత్తం డివిజన్లు: 66) ఉత్తర తెలంగాణలో బీజేపీకి కంచుకోటగా మారుతున్న కరీంనగర్లో కాషాయ జెండా రెపరెపలాడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- బీజేపీ: 25-29
- కాంగ్రెస్: 15-18
- బీఆర్ఎస్: 13-14
- ఎంఐఎం: 5-7
- ఇతరులు: 0-2
2. నిజామాబాద్ కార్పొరేషన్ (మొత్తం డివిజన్లు: 60) ఇందూరు గడ్డపై బీజేపీ తన పట్టును నిలుపుకునే దిశగా దూసుకుపోతోంది. ఇక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్ వెనుకబడ్డాయి.
- బీజేపీ: 22-24
- ఎంఐఎం: 15-17
- కాంగ్రెస్: 8-11
- బీఆర్ఎస్: 0-5
- ఇతరులు: 0-3
3. రామగుండం కార్పొరేషన్ (మొత్తం డివిజన్లు: 60) పారిశ్రామిక ప్రాంతమైన రామగుండంలో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉన్నప్పటికీ, AIFB (ఫార్వర్డ్ బ్లాక్) గట్టి పోటీనిస్తోంది.
- కాంగ్రెస్: 25-30
- AIFB: 12-15
- బీఆర్ఎస్: 10-14
- బీజేపీ: 5-10
- ఇతరులు: 3-5
4. మంచిర్యాల కార్పొరేషన్ (మొత్తం డివిజన్లు: 60)
- కాంగ్రెస్: 42-45
- బీఆర్ఎస్: 7-9
- బీజేపీ: 0-5
- ఇతరులు: 0-1
5. నల్గొండ కార్పొరేషన్ (మొత్తం డివిజన్లు: 48)
- కాంగ్రెస్: 30-32
- బీఆర్ఎస్: 8-10
- బీజేపీ: 0-4
- ఎంఐఎం: 0-2
- ఇతరులు: 0
6. కొత్తగూడెం కార్పొరేషన్ (మొత్తం డివిజన్లు: 60)
- కాంగ్రెస్: 31-33
- బీఆర్ఎస్: 10-13
- సీపీఐ: 8-10
- సీపీఎం: 0-1
- ఇతరులు: 0-3
7. మహబూబ్ నగర్ కార్పొరేషన్ (మొత్తం డివిజన్లు: 60)
- కాంగ్రెస్: 30-33
- బీఆర్ఎస్: 10-12
- బీజేపీ: 7-10
- ఎంఐఎం: 1-3
- ఇతరులు: 1-2
